- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నగరంలో డ్రగ్స్ కలకలం.. రేవ్ పార్టీలో పట్టుబడిన సెలబ్రిటీలు

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం డ్రగ్స్ వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేదిత డ్రగ్స్ అమ్మకాలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. దీంతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా బడాబాబులు నివాసముండే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాడిసన్ బ్లూ పబ్బుపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది.
విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ సేవిస్తూ 150 మందికి పైగా యువతీ యువకులు పోలీసులకు చిక్కారు. ఇందులో సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉండడం ఇదంతా పోలీసులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వినబడుతుండగా అదే పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ను షేక్ చేస్తోంది. హైదరాబాద్లో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా, రేవ్ పార్టీలు భగ్నం చేసినా, ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ ముఠాలు పోలీసులకు చిక్కినా టాలీవుడ్కు లింకులు వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా డ్రగ్స్ సరఫరాను అడ్డుకోలేకపోయారనే కారణంతో ఇన్ స్పెక్టర్ శివ చంద్రపై సస్పెన్షన్ వేటు వేయగా ఏసీపీ సుదర్శన్కు చార్జ్ మెమో జారీ చేశారు.
పోలీసులకు తెలిసే జరుగుతోందా..?
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉన్న రాడిసన్ పబ్లో మాదక ద్రవ్యాల వినియోగం పోలీసులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. రాడిసన్ పబ్ వ్యవహారం అంతా స్థానక పోలీసులకు తెలిసే జరుగుతోందని తెలిసింది. ఈ పబ్ ఓ మాజీ ఎంపీ కూతురుది కావడంతో బంజారాహిల్స్ పోలీసులు చూసి చూడనట్లు వదిలేసినట్టు సమాచారం. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో తెరిచి ఉంచే హోటళ్లు, బార్లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
అయితే రాడిసన్ పబ్ మాత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరిచి ఉన్నా పోలీసులు అటుగా కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వినబడుతున్నాయి. దాడుల అనంతరం పోలీసులు పబ్ నిర్వాహకులతో పాటు అందులో ఈవెంట్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో వారికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో విచారిస్తున్నారు. పట్టుబడిన వారిలో బడాబాబుల పిల్లలు ఉండటంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ రేవ్ పార్టీలో ఎల్ఎస్డి, గంజాయి, కొకైన్ లతో పాటు ఇతర డ్రగ్స్తో కూడిన సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు .
ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్ తో సరిపోతుందా..?
బంజారాహిల్స్ రాడిసన్ పబ్లో రేవ్ పార్టీ వ్యవహారం ఇన్ స్పెక్టర్ శివచంద్ర మెడకు చుట్టుకుంది. ఆయనను బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ బాధ్యతల నుండి తప్పించి ఆయన స్థానంలో టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్గా ఉన్న కె.నాగేశ్వర్ రావును బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సమయంలో సంబంధిత ఎస్హెచ్ఓలను బాద్యులను చేసి తప్పించడం వంటి చర్యలు తీసుకోవడమే తప్ప పూర్తి స్థాయిలో డ్రగ్స్ కట్టడి చేయడం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో నైజీరియన్లు హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా చేరిపోయారని, వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తేనే మాదక ద్రవ్యాల విక్రయాలు నిలిచిపోతాయనే అభిప్రాయాలు నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.