- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చంద్రబాబు చేతి వేలికి మైక్రోచిప్.. ఆ హైటెక్ రింగ్ రహస్యమిదే!
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ లేనిది చేతికి ఉంగరాలు పెట్టుకొని సమావేశంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రధారణతో ఎంతో సింపుల్గా కనిపించే ఆయన.. ఎలాంటి ఆభరణాలు కానీ.. ఉంగరాలు కానీ ధరించడానికి ఇష్టపడరు. కానీ, సడన్గా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో చేతి వేళ్లకు ఉంగరాలు ధరించి కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుండగా.. తాజాగా.. స్వయంగా చంద్రబాబే ఉంగరం ధరించడంపై స్పందించారు. గురువారం పాల్గొన్న ఓ సమావేశంలో హైటెక్ రింగుపై పార్టీ కేడర్కు వివరించారు. ఇది ఆడంబరాలకు పెట్టుకున్న ఉంగరం కాదని క్లారిటీ ఇచ్చారు. ఆ హైటెక్ రింగ్లో మైక్రోచిప్ అమర్చినట్లు తెలిపారు. దీంతో ఆ ఉంగరం తన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తుందని వివరించారు. నిత్యం తన ఆరోగ్య పరిస్థితిని కంప్యూటర్కు పంపిస్తుందని వెల్లడించారు. దానిని బట్టి వైద్యులు తనకు సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు.