PM Modi AP Tour: భీమవరంలో భారీ భద్రత.. ప్రధానికి స్వాగతం పలికిన జగన్

by Disha Web Desk 2 |
CM Jagan Welcomes PM Modi At Gannavaram Airport
X

దిశ, డైనమిక్ బ్యూరో: CM Jagan Welcomes PM Modi At Gannavaram Airport| ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బయలుదేరారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్​ విశ్వభూషణ్​హరిచందన్, సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మోడీ భీమవరానికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు గవర్నర్, సీఎం భీమవారినికి వెళ్తారు. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకల్లో మోడీ పాల్గొని 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని పర్యటనతో భీమవరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story