- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ధోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. 41 అడుగుల కటౌట్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
దిశ, ఏపీ బ్యూరో : మన దేశంలో క్రికెట్కు ఉన్నంత క్రేజీ మామూలుగా ఉండదు. తమ అభిమాన క్రికెటర్ల పుట్టినరోజును పండుగలా జరుపుకునేటంతగా ఆ క్రేజ్ ఉంటుంది. ఇక అందులోనూ టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు అంటే ఇక మామూలుగా ఉంటుందా. అభిమానులు పండగ చేసుకోవాల్సిందే కదా. మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే ధోనీకి దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెరిగిపోదని అభిమానులు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇక తెలుగు ప్రజలు ఎవరినైనా అభిమానించారంటే దానికి వెలకట్టలేం. వాళ్లు అంతలా తమ అభిమాన హీరోను అయినా అభిమాన క్రికెటర్ అయినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.
అంతేకాదు తమ అభిమాన నటుడు లేదా క్రీడాకారుల బర్త్ డేలను అత్యంత స్పెషల్గా నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొందరు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేస్తే మరికొందరు భారీ కట్ అవుట్స్ పెట్టి హల్ చల్ చేస్తారు. ఇలానే ధోనిపై అభిమానాన్ని కొందరు భారీ కటౌట్ ఏర్పాటు చేసి చాటుకున్నారు కొందరు యువకులు. కృష్ణా జిల్లా నందిగామలో 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కటౌట్లో ధోని సిగ్నేచర్ హెలికాప్టర్ షాట్ ఆడుతున్నట్టు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కటౌట్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కటౌట్ను అంబారుపేట గ్రామానికి చెందిన భువన్ చారీ, భారత్, సాయి, సిద్దు, బెనాకర్ సహా మరికొందరు ధోనీ అభిమానులు ఏర్పాటు చేశారు. తమకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ ధోనీ పుట్టిన రోజున 41 అడుగుల కటౌట్తో పాటు 41 కేజీల కేక్ను కట్ చేసినట్లు అభిమానులు తెలిపారు.