ఆ నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్పత్రి స్థాయి పెంపునకు ఉత్తర్వులు జారీ

by Disha Web Desk 13 |
ఆ నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్పత్రి స్థాయి పెంపునకు ఉత్తర్వులు జారీ
X

దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ 30 బెడ్ల ఆస్పత్రి స్థాయిని పెంచుతూ.. అందుకు అవసరమైన నిధులను కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 30 బెడ్ల ఆసుపత్రిగా ఉన్నా మక్తల్ ఆసుపత్రిని 150 బెడ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల అవసరాల దృష్ట్యా ఆస్పత్రి స్థాయిని పెంచాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆస్పత్రి స్థాయిని పెంచుతూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రికి స్థాయిని పెంచేందుకు గాను ప్రభుత్వం 36.37కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ ఆసుపత్రితో పాటు జనరల్ ఆస్పత్రిలో కాన్పులు, శిశు సంరక్షణ బెడ్‌లను 50 నుండి వందకు పెంచుతూ.. కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆసుపత్రి స్థాయిని పెంచేందుకు నిధులు కేటాయించడానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


Next Story