నడిరోడ్డుపై పిచ్చ కొట్టుడు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

by Disha Web |
నడిరోడ్డుపై పిచ్చ కొట్టుడు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్
X

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడ వన్ టౌన్ కేబీఎన్ కళాశాల సమీపంలో ఇద్దరు విద్యార్థినిలు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. నలుగురు చూస్తున్నారనే విచక్షణ మరచిపోయి జుట్టుపట్టుకుని దాడి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కళాశాల తరగతి గదిలో ఏమైందో తెలియదు కానీ కళాశాల వదిలిన వెంటనే బయటకు వచ్చిన విద్యార్థినిలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముష్టి యుద్ధానికి దిగారు. అయితే ఎందుకు కొట్టుకున్నారో అనేది మాత్రం తెలియడం లేదు. అమ్మాయిలు ఇద్దరు కొట్టుకుంటుండగా మరో విద్యార్థిని విడదీసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు కొట్టుకున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు వీధి పోరాటాలకు దిగడం.. ధర్నాలు చేయడం చూశాం కానీ ఇలా ముష్టి యుద్ధానికి దిగడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యార్థిని దాడి చేసుకుంటున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుయి.


Next Story

Most Viewed