- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆట ముగియలేదు.. రాష్ట్రపతి ఎన్నికలపై బెంగాల్ సీఎం వ్యాఖ్యలు
by Harish |

X
కోల్కతా: త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రాన, రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ రాదని అన్నారు. ఆట అప్పుడే ముగియలేదని దేశంలో సగం సంఖ్యలో కూడా శాసన సభ్యులు బీజేపీకి లేరని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికలు అంత తేలికేం కాదు. దేశంలో వారికి సగం సంఖ్యలో కూడా శాసనసభ్యులు కూడా లేరు. దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఏకమవుతారు. ఆట అప్పుడే ముగియలేదు. సమాజ్ వాదీ పార్టీ యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను కలిగి ఉంది అని అన్నారు. కాగా కేంద్ర, రాష్ట్ర శాసన సభ్యులతో ఎలక్టోరల్ కాలేజ్ నుంచి ఎన్నిక చేయబడిన సభ్యులచే పరోక్షంగా ఈ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి.
Next Story