- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రంగువేయొద్దన్నాడని బాలుడిపై బ్లేడుతో దాడి.. తీవ్రంగా రక్తం కారడంతో..

దిశ, బంజారాహిల్స్ :హోళీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తనకు బలవంతంగా రంగులు పూయొద్ధని వారించిన బాలుడిపై తోటి స్నేహితులు బ్లేడ్తో దాడి చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరా నగర్లో నివసించే శ్రీహరి (13) హోళీ సందర్భంగా తన ఇంటి ముందు హోలీ ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అతడి ఇంటికి సమీపంలో నివసించే ముగ్గురు స్నేహితులు అభి, నాని, బబ్లూ అక్కడికి వచ్చి శ్రీహరికి రంగులు పూశారు. బలవంతంగా నెత్తి మీద కోడిగుడ్లు కొట్టారు. దాంతో శ్రీహరి వారి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో స్నేహితులు ముగ్గురూ కలిసి తమతో పాటు తెచ్చుకున్న బ్లేడ్తో శ్రీహరి వీపు మీద గాట్లు పెట్టారు. తీవ్రంగా రక్తస్రావం అవతుండగా శ్రీహరి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయినా స్నేహితులు మాత్రం వదలకుండా శ్రీహరి తొడలపై కూడా బ్లేడ్తో గాట్లు పెట్టారు. అదే సమయంలో బాధితుడి తల్లి లక్ష్మి అక్కడికి వచ్చి తీవ్రంగా గాయపడిన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాడికి పాల్పడిన ముగ్గురు పిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అభి, నాని, బబ్లూను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.