ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: శ్రీనివాసరావు

by S Gopi |
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: శ్రీనివాసరావు
X

దిశ, కొత్తగూడెం: జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కొత్తగూడెం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గడ్డల శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి ప్రాంత ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత వైద్య శిబిరంలో వ్యాధి నిర్ధారణ కొరకు అన్ని రకాల రక్త పరీక్షలు ఎక్స్రే అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి అనేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడంతోపాటు వ్యాధి నిర్ధారణ అనంతరం వారికి కావలసిన మందులు ఉచితంగా పంపిణీ చేయబడతాయి అని అన్నారు. వ్యాధి నిర్ధారణ అనంతరం రోగికి శస్త్ర చికిత్సలు సైతం జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేపించబడతాయి అని తెలిపారు.

ఈ ఉచిత వైద్య శిబిరానికి 150 మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో పనిచేసే వైద్య నిపుణులు హాజరవుతున్నట్లు తెలిపారు. వైద్య శిబిరానికి హాజరయ్యే ప్రజలకు భోజనంతో సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈ వైద్య శిబిరానికి సుమారు మూడు వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని జీఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గడ్డల శ్రీనివాసరావు తెలిపారు.



Next Story