మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ

by Jakkula.Mamatha |

రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన లవణం శ్రీను అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ
X

దిశ,రామన్నపేట : రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన లవణం శ్రీను అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాల్వేరు అశోక్ స్థానిక పార్టీ నాయకులతో కలిసి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుని కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్, డీసీఎంఎస్ జిల్లా మాజీ డైరెక్టర్ జెల్ల వెంకటేష్, లవణం సాయి, లవణం పాండు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Next Story