- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టాలీవుడ్కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

దిశ, ఏపీ బ్యూరో: సినీ పరిశ్రమకు వైసీపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో థియేటర్లలలో 100 శాతం ఆక్యుపెన్సీకీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రేక్షకులు ఖచ్చితంగా మాస్క్ ధరించి సినిమాకు రావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గురువారం నుంచే 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే టికెట్ల ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం ముగిసింది.
సచివాలయంలో ఉదయం 11.30గంటలకు కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వారం రోజుల్లో టికెట్ రేట్లపై మా ప్రతిపాదనలు ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. టికెట్ ధరలు నిర్ణయించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిన్న సినిమాలు బతకాలి కనుక ప్రాధాన్యమివ్వాలని కమిటీ సూచించింది.
సచివాలయంలో ఉదయం 11.30గంటలకు కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వారం రోజుల్లో టికెట్ రేట్లపై మా ప్రతిపాదనలు ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. టికెట్ ధరలు నిర్ణయించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిన్న సినిమాలు బతకాలి కనుక ప్రాధాన్యమివ్వాలని కమిటీ సూచించింది.