మహా బల పరీక్ష నేడే

by Dishanational1 |
మహా బల పరీక్ష నేడే
X

దిశ, వెబ్ డెస్క్: రెండు వారాల తీవ్ర రాజకీయ సంక్షోభం అనంతరం బీజేపీ సహాయంతో మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటై, షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, షిండే ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోనున్నది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ స్పీకర్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, బీజేపీకి ప్రస్తుతం 106 మంది ఎమ్మెల్యేలు, శివసేన తిరుగుబాటు దారుల లిస్ట్ లో 39 మంది ఎమ్మెల్యేలు సహా 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు కూడా షిండే పేర్కొన్నారు. ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మెజారిటీ మార్కు 137కు చేరుకుంటుంది. మొత్తం బలం 140తో ప్రభుత్వం సౌకర్యవంతమైన స్థితిలో ఉంటుంది.


Next Story