జూలై 1 నుంచి 'దోస్త్' దరఖాస్తులు

by Disha Web Desk |
జూలై 1 నుంచి దోస్త్ దరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పలు వ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేష‌న్ విడుద‌లైంది. జూలై 1వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్​లింబాద్రి ఆయన కార్యాలయంలో బుధవారం నోటిఫికేషన్​విడుదల చేశారు. జూలై 1వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు మొద‌టి విడుత రిజిస్ట్రేష‌న్లకు అవ‌కాశం క‌ల్పించారు. దరఖాస్తుదారులు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జులై 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆగ‌స్టు 6వ తేదీన మొద‌టి విడుత దరఖాస్తుదారులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆగ‌స్టు 7 నుంచి 18 వ‌ర‌కు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు, ఆగ‌స్టు 7 నుంచి 21వ తేదీ వ‌ర‌కు రెండో విడుత రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ కొన‌సాగ‌నుంది. దీనికి విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉందన్నారు. థర్డ్​ఫేజ్‌కు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్​12 వరకు అవకాశం కల్పించారు. అక్టోబర్​1 నుంచి డిగ్రీ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నట్లు లింబాద్రి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed