- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంచలన ప్రకటన చేసిన డీకే అరుణ.. త్వరలో..

దిశ, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అనవసరమైన హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గంగాపూర్, గ్రామాలలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బురుగుపల్లి రంగాపురం గ్రామాల్లో మిడ్జిల్ మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు డీకే అరుణ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా గంగాపురం మిడ్జిల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు అనవసర హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన హామీలు తాము నెరవేరుస్తామని ఆమె అన్నారు. రెండోసారి అధికారం అప్పగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటామని.. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా తెలంగాణ ప్రజానీకాన్ని నిలువెత్తునా మోసం చేశారని మండిపడ్డారు.
మరోవైపు నాడు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టుల పనులు నిర్వహించామని.. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా లేకుండా పోయిందని, ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి తమ పార్టీలో చేర్పించుకుంటున్నారని సీఎం కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా బాగుపడ్డారా అంటే అది కేసీఆర్ కుటుంబమే అని ఆమె విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవ తేదీ దాటినా జీతాలు చెల్లించలేని స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చారన్నారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారని ఆమె అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయినా పోకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కేసీఆర్ కు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పి బీజేపీ పార్టీకి అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గం బీజేపీ నాయకురాలు బాలా త్రిపుర సుందరి, మిడ్జిల్ వైస్ ఎంపీపీ తిరుపతమ్మ రవి గౌడ్, జిల్లా నాయకులు వెంకట్ రామ్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాహితి రెడ్డి, నాగరాజ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ రాజు, గౌరీ శంకర్ లు పాల్గొన్నారు.