లబ్దిదారులకు దళిత బంధు చెక్కుల పంపిణీ

by Dishafeatures2 |
లబ్దిదారులకు దళిత బంధు చెక్కుల పంపిణీ
X

దిశ, భిక్కనూరు: దళిత బంధు చెక్కులను ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ చేతులమీదుగా శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన రామగళ్ళ దినేష్ కు టెంట్ హౌస్ కోసం పది లక్షల చెక్కును, క్యాస్థి రాజుకు సెంట్రింగ్ డబ్బా కోసం 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షుడు గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లేష్ మంజులా మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కాసర్ల లీలావతి బాలాగౌడ్, ఎంపీడీవో అనంతరావు, ఎం పి ఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story