రాష్ట్రపతితో భేటీ కానున్న కేజ్రీవాల్

by Dishanational4 |
రాష్ట్రపతితో భేటీ కానున్న కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆగస్టు 14న సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ.. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 25 లక్షల జాతీయ జెండాలను ఢిల్లీ పట్టణంలో పంపిణీ చేయనుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. హర్ ఘర్ తిరంగా.. హర్ హాత్ తిరంగా కార్యక్రమాన్ని దేశ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. అలాగే భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు.


Next Story

Most Viewed