- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాకేం తెల్వదు.. మంత్రి హత్య కుట్ర కేసులో నోరు విప్పని నిందితులు

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితుల విచారణ కొనసాగుతోంది. గురువారం పేట్ బషీరాబాద్ పోలీసులు రెండవ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మేడ్చల్ కోర్టు ఆదేశాలతో వారిని వీడియో రికార్డింగ్ చేస్తూ విచారణ చేస్తున్నారు.
కాగా, విచారణ సందర్భంగా నిందితుల నుంచి ఒకే సమాధానం వస్తున్నట్లు తేలింది. మంత్రి హత్య కుట్రలో తమకేం సంబంధం లేదని, ఆ స్థాయి కూడా లేదని వెల్లడించినట్లు సమాచారం. కానీ, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కారణంగా తాము అన్ని విధాల నష్టపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
మరోవైపు మంత్రిని హత్యకు రూ. 15 కోట్ల సుఫారీ ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిందితుల విచారణపై ఆసక్తి నెలకొంది. పోలీసు వర్గాల నుంచి మాత్రం ఎటువంటి వివరాలు బయటకు వెల్లడించలేదు. అంతేకాకుండా నిందితుల తరలింపుపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 13 వరకూ నిందితుల కస్టడీ కొనసాగనుంది.