నేటి నుంచి 12–14 వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్​

by Disha Web Desk 13 |
నేటి నుంచి 12–14 వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్​
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: నేటి నుంచి 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు కొవిడ్​–19 వ్యాక్సిన్​వేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 2010 మార్చి 15 కంటే ముందు జన్మించిన పిల్లలే వ్యాక్సిన్​వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యాశాఖలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.


శిక్షణ పొందిన వైద్య సిబ్బందితోనే వ్యాక్సిన్​ వేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్​అమోయ్​కుమార్​పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ విజయవంతం​చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed