- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ అందుకే నల్ల దుస్తులు ధరించింది: అమిత్ షా
దిశ, వెబ్డెస్క్: గత కొంతకాలంగా దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. కేంద్ర ప్రభుత్వ వీటిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే తమ నిరసనల్లో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ నేతలందరూ నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అయితే శుక్రవారం కాంగ్రెస్ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. కాంగ్రెస్ కావాలనే ఈ రోజును ఎంచుకుని నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతుందని అన్నారు. 'కాంగ్రెస్ తన బుజ్జగింపు రాజకీయాలను మరింత ప్రమోట్ చేసుకునేందుకు ఈ నిరసనలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రతి రోజూ నిరనసలు చేస్తోంది. కానీ ఈరోజే ప్రత్యేకంగా నల్ల దుస్తులు ధరించిందో మొదట నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ రోజునే ప్రధాని నరేంద్ర మోదీ రామ జన్మభూమికి పునాది వేశారు. ఈ రోజు నల్ల దుస్తుల్లో నిరనస తెలపడం ద్వారా కాంగ్రెస్ యాంటీ రామ మందిరం మెసేజ్ను వ్యాప్తి చేస్తోంది'' అని అమిత్ షా చెప్పుకొచ్చారు.