- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కలిసి నడిస్తేనే కాంగ్రెస్కు అవకాశం: గూడూరు
by S Gopi |

X
దిశ, ఆమనగల్లు /కడ్తాల్: కడ్తాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా పూల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడిగా జంగయ్య, విజయ్, కార్యదర్శిగా శ్రీను, సంయుక్త కార్యదర్శి మల్లయ్య, కార్యవర్గ రమేష్, చంద్రయ్య, బాల రాజ్,శేఖర్,మల్లయ్య, లక్ష్మణ్,శంకరయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ అధ్యక్షులు యాట నరసింహ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసి నడిచి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు, నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.
Next Story