కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌కు అనూహ్య షాక్.. గులాబీ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు

by Disha Web Desk 2 |
కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌కు అనూహ్య షాక్.. గులాబీ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు
X

దిశ, కూకట్​పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు ఆసీఫ్ ఖాన్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ(మంగళవారం) పట్టణంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అంతేగాక, అల్లాపూర్​ డివిజన్​ నుంచి ఎండీ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నాయకుడు షఫీ టీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. ఇద్దరికీ గులాబీ కండువా కప్పిన కేటీఆర్ వారిని సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


Next Story

Most Viewed