- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ ఖేల్ ఖతం.. టీఆర్ఎస్ దుకాణం బంద్

దిశ, ఫరూక్ నగర్: తెలంగాణాలో ఒక మోస పూరిత, దగాకోరు, కుటుంబ పరిపాలన నడుస్తోందని.. ఇకపై కేసీఆర్ ఖేల్ ఖతం.. టీఆర్ఎస్ దుకాణం బంద్ కాక తప్పదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ "వీర్లపల్లి శంకర్" అన్నారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో గిరిజన, దళిత ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియమాకాల ఆశ జూపి అడ్డంగా మోసం చేశారని, ఇకపై ఇచ్చిన హామీ నిలబెట్టేదాకా కేసీఆర్ పరిపాలనపై ఉద్యమాలు చేపడతామని అన్నారు. హరిజన, గిరిజన ప్రజలకు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్ హామీలకే పరిమతమై అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాక నిరుద్యోగ జంగ్ సైరన్, దళిత, గిరిజన దండోర, మన ఊరు మన పోరు లాంటి అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాడుతున్నారని అన్నారు. కొల్లాపూర్ సమావేశానికి వెళ్తున్న రేవంత్ రెడ్డికి షాద్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.