హైకమాండ్ తప్పు చేస్తుంది: నాయిని రాజేందర్ రెడ్డి

by S Gopi |   ( Updated:2022-03-23 07:26:02.0  )
హైకమాండ్ తప్పు చేస్తుంది: నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ, హన్మకొండ చౌరస్తా: ఇది నా అడ్డ ఎవ్వరు పడితే వారు నియోజక వర్గంలో పోటీ చేస్తా అంటే ఊరుకొనేది లేదు. అధిష్టానం ఈనెల 30 వరకు ప్రకటించకపోతే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తానని హన్మకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలు పశ్చిమ నియోజక వర్గం నుండి పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ కోవర్టులు లాంపెంగి గ్యాంగును వేసుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధిష్టానానికి 10 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు చేస్తే పోలీసుల లాఠీ చార్జీలు, కేసులతో కోర్టుచుట్టూ తిరుగుతున్నామని అన్నారు. పార్టీ ప్రతిష్ఠత కోసం అనునిత్యం పనిచేస్తున్నానని.. ఎప్పటికైనా పార్టీ పెద్దలు సమస్యను పరిష్కరించాలని కోరారు. పార్టీలోనే చిల్లర రాజకీయాలు చేస్తున్న కొందరి వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని సున్నితంగా చెప్పారు.



Next Story

Most Viewed