- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూడెకరాల భూమి ఇవ్వవు.. కానీ పేదలకు ఇచ్చిన భూమిని గుంజు కుంటారా..?

దిశ, జడ్చర్ల: దళిత రైతులకు ఒక్కొక్కరికి మూడెకరాల భూములు ఇస్తాం, ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఉన్న బాలానగర్, రాజాపూర్, భూత్పూర్, జడ్చర్ల మండల పరిధిలో ఉన్న దాదాపుగా నాలుగు వందలకు పైగా ఎకరాల పొలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. రాజాపూర్ మండల కేంద్రంలో బుధవారం జడ్చర్ల కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి సారథ్యంలో ఒకరోజు నిరసన కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు కొత్వాల్, రాష్ట్ర నేతలు మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, గిరిజనులు, బీద బడుగు వర్గాల రైతులకు భూములను ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూములను సాగు చేసుకునే విధంగా సహకరించాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి ఆ భూములను స్వాధీన పరుచుకోవాలని ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం తమ ప్రయత్నాలను విరమించుకోవాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భూత్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నేత మధుసూదన్ రెడ్డి ఆందోళన చెందుతున్న రైతులను కలిసి మనోధైర్యం కల్పించారు.