- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత

దిశ, దేవరకద్ర: కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న 31,000 వేల మంది సభ్యుల బీమాకు సంబంధించిన 7,75,000 రూపాయల చెక్కును జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు 31వేల మందిని కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేర్పించిన ప్రతి ఒక్క బూత్ ఎన్ రోలర్ కి, వారికి సహాయం అందించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానానికి, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారి పట్టుదలకు ఎల్లప్పుడూ ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేకత విధానాలను ప్రజలకు తెలియచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాధాకృష్ణ రెడ్డి, టీపీసీసీ ఓబీసీ కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ మైనార్టీ కార్యదర్శి అంజాద్ అలీ, టీపీసీసీ ఫిషేర్మెన్ కార్యదర్శి మహేష్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, చిన్నచింతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డ్ , దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు సత్యశిలారెడ్డి, చిన్నచింతకుంట మండల కో-ఆప్షన్ మహమూద్, భూత్పూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ గౌడ్, వనపర్తి జిల్లా బీసీసెల్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వేమన్న, తాటిపర్తి ఎంపీటీసీ పుల్లయ్య, మహాబుబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫసియుద్దీన్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ రెడ్డి, మదనాపురం మండల ఓబీసీ అధ్యక్షులు రాఘవేంద్ర, ఎన్ ఎస్ యుఐ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని ప్రవీణ్ కుమార్, కొత్తకోట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చాంద్ పాషా, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జానకిరామ్, మదనాపురం మండల కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, కావలి అశోక్ కుమార్, విజయ్, గట్టన్న తదితరులు పాల్గొన్నారు.