Chandrababu: ఆయన ఆత్మహత్య కలచివేసింది.. వైసీపీ విష సంస్కృతే కారణం: చంద్రబాబు

by Dishafeatures2 |
Chandrababu: ఆయన ఆత్మహత్య కలచివేసింది.. వైసీపీ విష సంస్కృతే కారణం: చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా కుప్పం గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ పార్థసారథి ఆత్మహత్య పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్థసారథి ఆత్మహత్య, స్థానికంగా నెలకొన్న ఆందోళనలపై స్థానిక పార్టీ నేతలతో చంద్రబాబు ఆరా తీశారు. సొంత పార్టీ వాళ్ళ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పార్థసారథి సెల్ఫీ వీడియోలో చెప్పారని, వైసీపీ నేతల వేధింపులకు చివరికి సొంత పార్టీ వ్యక్తులు కూడా బలి అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'డబ్బులకు పదవులు అనే విష సంస్కృతిని వైసీపీ నేతలు కుప్పంలో కూడా తీసుకువచ్చారు. గంగమ్మ గుడి చైర్మన్‌గా పనిచేసిన బలహీన వర్గానికి చెందిన పార్థసారథి సొంత పార్టీలో అవమానాలకు ప్రాణాలు తీసుకోవడం విచారకరం. పార్థసారథి ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? సెల్ఫీ వీడియోలో పార్థసారథి చెప్పిన మాటల ఆధారంగా కేసు నమోదు చేయాలి, ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్థసారథి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


Next Story

Most Viewed