కోపంగా చూశాడని దారుణ హత్య

by Disha Web Desk |
కోపంగా చూశాడని దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి సమాజంలో ప్రాణం అంటే విలువ లేకుండా పోయింది. మనవత్వం మరిచిపోయి చిన్న చిన్న కారణాలకే హత్యలకు పాల్పడుతున్నారు. కోపంగా చూశాడని ఓ వ్యక్తిని కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన ఐటీ సిటీ బెంగుళూరులో జరిగింది. భరత్ అనే యువకుడు రోడ్డు పై వెళ్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి బైక్ తగిలింది. బైక్ తగిలినందుకు భరత్ కోపంతో వారి వైపు చూశాడు. దీంతో అలా కోపంగా చూస్తావా అంటూ బైక్ తగిలించిన యువకుడు స్నేహితులు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయినా కోపం చల్లారక పోవడంతో భరత్ శవాన్ని ఈడ్చుకొంటూ వెళ్లారు. కెంగేరి రైల్వే గేట్ సమీపంలో రైల్వే పోలీసులను వరకు వెళ్లగానే అక్కడ ఉన్న పోలీసులు కనిపించడంతో శవాన్ని వదిలేసి పారిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed