- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్నేహితుడి తాత అంత్యక్రియలకు వెళ్లి బాలుడు మృతి

దిశ, భిక్కనూరు: విరిగిన చింత చెట్టు కొమ్మ మీద పడి పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శనిగరం సంపత్ తన స్నేహితుని తాత అంత్యక్రియలకు వెళ్లాడు. ఖననం జరిగే స్థలానికి కొద్ది దూరంలో ఉన్న చింత చెట్టు వద్ద స్నేహితులతో ఉన్నాడు. ఈ క్రమంలో చింతకాయల కోసం చెట్టు పైకెక్కగా.. తేనె తెట్టెలో నుంచి కందిరీగలు ఒక్కసారిగా లేచాయి. దీంతో భయపడి పోయి, వాటి బారి నుంచి తప్పించుకునేందుకు చెట్టు కొమ్మను పట్టుకొని కిందికి దిగే ప్రయత్నంలో కొమ్మ విరిగి మీద పడింది. దీంతో సంపత్ రక్తం కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. అంత్యక్రియలకు హాజరైన వారు ఘటనా స్థలానికి వచ్చి చూడగా సంపత్ ప్రాణాలు వదిలాడు. స్నేహితుని తాత అంత్యక్రియలకు వెళ్లి.. మమ్మల్ని వదిలి పోతివా బిడ్డా అంటూ తల్లి దండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నవారిని చూసి ఆపడం ఎవరి వల్ల కాలేదు. విద్యార్థి సంపత్ మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. భిక్కనూరు ఎస్ఐ ఆనంద్ గౌడ్ ను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.