అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించాలి.. సోము వీర్రాజు

by Disha Web Desk 13 |
అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించాలి.. సోము వీర్రాజు
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని రైతుల సమస్యను సజీవంగా ఉంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లకు పనులు పూర్తి చేసి ఇవ్వాలన్నారు. దీనికి తగిన సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాజధానిపై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయని తెలిపారు. వందల రోజుల నుంచి రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు ఒక షెడ్యూల్ ప్రకారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


Next Story