- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేములవాడలో సంబరాలు

దిశ, వేములవాడ టౌన్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు స్పష్టమైన ఆధిక్యంతో ముందున్న సందర్భంగా వేములవాడ పట్టణంలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేసి బాణాసంచకాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతిని రహిత రక్షణాత్మక అభివృద్ధిలో జాతీయవాధ నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని.. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అవినీతితో మాయమాటలతో నియంత కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ గెలుపునకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఎంపీపీ బండ మల్లేశం, మండల అధ్యక్షులు ఎఱ్ఱం నర్సయ్య, మహాకాళీ శ్రీనివాస్, జింక అనిల్, పిన్నింటి హనుమండ్లు, గుడిసె మనోజ్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.