- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫంక్షన్ హాల్లో భారీ పేలుడు.. అనుమానాలెన్నో..
దిశ, కుత్బుల్లాపూర్ : ఓ కన్వెన్షన్ హాల్లో భారీ పేలుడు సంభవించి మహిళ మృతి చెందిన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ గండిమైసమ్మ మండలంలోని బహదూర్ పల్లిలో గల ఎస్బీవీకే ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేసే ఓ మహిళ మృతి చెందింది. కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన లక్ష్మి, జయరాం దంపతులు బహదూర్ పల్లిలో గల ఎస్బీవీకే ఫంక్షన్ హాల్లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. లక్ష్మి ఫంక్షన్ హాల్లో ఉన్న ఓ ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని శుభ్రం చేసేందుకు బయటికి వస్తున్న క్రమంలో ఆ డబ్బా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో లక్ష్మి (30) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది.
ఫంక్షన్ హాల్లో ప్లాస్టిక్ డబ్బా పేలుడు జరగడం, ఓ మహిళ శరీరం పూర్తిగా ఛిద్రం అయ్యి అక్కడికక్కడే మరణించడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దుందిగల్ సీఐ రమణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పోలీసు జగిలాలను రప్పించి శనివారం రాత్రి వరకు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. శుభ కార్యాలు నిర్వహించుకునే ఓ ఫంక్షన్ హాల్లో భారీ స్థాయిలో పేలుడు జరగడం స్థానికులను ఒక్కసారిగా భయ బ్రాంతులకు గురించేసింది. ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు ఎవ్వరు?పేలుడుకు కారణం జిలిటెన్ స్టిక్స్ లేక, రసాయన పదార్థాలా? లేక మరే ఇతర పేలుడు పదార్థాలా అనేది పోలీసుల విచారణలో తేలియాల్సి ఉంది.