అనారోగ్యంతో ఆంబోతు మృతి.. ఆ గ్రామస్తులు ఏం చేశారంటే?

by Disha Web Desk 13 |
అనారోగ్యంతో ఆంబోతు మృతి.. ఆ గ్రామస్తులు ఏం చేశారంటే?
X

దిశ, గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుణ్య తండ గ్రామంలో ఇస్లావత్ చిన్న శీను 20 ఏండ్ల కిందట కురవి వీరభద్ర స్వామి మొక్కుబడితో ఆంబోతుని గ్రామంలో వదిలాడు. మూడు రోజుల కిందట ఆంబోతు అనారోగ్యంతో ఉండగా ఆదివారం రాత్రి మరణించడంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో డీజే, డప్పు చప్పుళ్లతో ఊరేగింపు జరిపి దహన సంస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ వెంకన్న, బానోత్ హరియా, ఇస్లావత్ బాలరాజ్,మూడ్ వెంకన్న, ఇస్లావత్ రావో జి, గూగుల్ శ్రీను, గుగులోత్ జాగ్య గ్రామ ప్రజలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



Next Story