- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వానాకాలం సీజన్కు ముందస్తు ఏర్పాట్లు.. మంత్రుల బృందం రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియలో నెలకొన్న ఇబ్బందులు, ఎఫ్సీఐ తీసుకోవడంలో ఎదురవుతున్న సమస్యలు.. వీటన్నింటిపై ముగ్గురు మంత్రుల బృందం, అధికారులు సచివాలయంలో శుక్రవారం సమీక్షించి వెంటవెంటనే మిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ దగ్గర భారీ స్థాయిలో ఉన్న నిల్వలను వీలైనంత తొందరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకు అప్పగించేందుకు చొరవ తీసుకోవాలని ఆ శాఖ అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను తగ్గించుకుంటేనే రానున్న వానాకాలం సీజన్కు వచ్చే ధాన్యాన్ని స్టాక్ చేయడానికి అవసరమైన స్టోరేజీ స్పేస్ దొరుకుతుందని వివరించారు.
మిల్లింగ్ ప్రక్రియను వీలైనంత వేగంగా చేయడం ద్వారా మాత్రమే వచ్చే సీజన్కు ధాన్య సేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోగలమని, ఇందుకోసం నిరంతరం ఎఫ్సీఐ అధికారులతో సంప్రదింపులు జరుగుతూ ఉండాలని సూచించింది. చిన్నచిన్న కారణాలతో బియ్యాన్ని తీసుకోడానికి ఎఫ్సీఐ నిరాకరించినా మెరుగైన సమన్వయం ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోడానికి అవకాశం లభిస్తుందని అధికారులకు మంత్రుల బృందం వివరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ఏం చేయాలనే అంశం మీదా కూడా చర్చ జరిగింది. కానీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా సోమవారం జరిగే సమావేశంలో ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.