ప్రియా సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం

by Disha Web Desk 13 |
ప్రియా సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం
X

దిశ, మేళ్లచెరువు: మండల పరిధిలోని ప్రియా సిమెంట్ (రెయిన్)పరిశ్రమలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగి వేణు తో పాటు మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ వద్ద స్టీమ్ వాటర్ కార్మికుల మీద పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. రోజు వారిగా డ్యూటీ కి వెళ్లిన వారికి ప్రమాదం జరగడంతో తోటి కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాయపడ్డవారిలో వేణు, నిగిడాల శ్రీనివాస్, రత్నాకర్ ఉన్నారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.


Next Story

Most Viewed