- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'బెగ్గింగ్ తాత' సూపర్.. అడుక్కోవడంలోనూ కొత్త స్టైల్
దిశ, వెబ్డెస్క్: అమ్మ ధర్మం, అయ్యా ధర్మం అంటూ బిచ్చమెత్తుకుంటున్న ఓ యాచకుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా..? ఇతగాడు అందరిలా కాలినడకనో, మొకాళ్లపై వస్తూనో బిచ్చమొత్తుకోవడం లేదు. ట్రెండీగా బైకుపై మైకు ఏర్పాటు చేసుకొని మరీ వెరైటీగా బిచ్చమొత్తుకుంటున్నాడు. ఈ వినుత్న ఘటన ఏపీలోని మంగళగిరిలో చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహం కూడలిలో మంగళవారం ఉదయం బైకుపై మైక్ను ఏర్పాటు చేసుకుని ధర్మం చేయాలంటూ యాచిస్తున్నాడు. దీనిని చూసిన వాళ్లు సమాజం డెవలప్ అయ్యింది. నోటితో అడగడం మానేసి ఇలా మైక్లు ద్వారా యాచిస్తున్నారు అంటూ చర్చించుకుంటున్నారు. కాగా, దీని గురించి ఆయన్ని ప్రశ్నించగా.. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించి మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముల్లుగుచ్చకుంది. అది కాస్తా సెప్టిక్ కావడంతో మోకాలి వరకు పుండ్లు పడి నడవలేని పరిస్థితిలో ఈ విధంగా యాచిస్తున్నట్లు చెప్పాడు.