- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య.. స్నేహితుడికి వీడియో కాల్ చేసి..
దిశ, మెదక్: 'జనార్దన్ జీవితంపై విరక్తి కలిగింది.. ఇక నేను చచ్చిపోతున్నా.. ఇంట్లో చెప్పు' అంటూ ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం మంబోజి పల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల, గ్రామస్తుల కథనం మేరకు.. పాపన్నపేట మండలం ఎల్లాపూర్కు చెందిన మంగన్న సత్తయ్య(34) గ్రామంలోనే ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. 13 సంవత్సరాల క్రితం వినోదతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడు రోజుల క్రితం వినోోద తల్లిగారిల్లు అల్లిపూర్కు వెళ్ళింది. శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చిన వినోద భర్త సత్తయ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. కానీ కొద్దిసేపటికే అదే గ్రామానికి చెందిన జనార్ధన్కు సత్తయ్య వీడియో కాల్ చేసి జీవితంపై విరక్తితో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పడంతో జనార్దన్ వెంటనే ఆ విషయం వినోదతో చెప్పాడు. ఆమెతో కూడా మాట్లాడించాడు. వెంటనే కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం మంబోజి పల్లి గ్రామ శివారులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా సత్తయ్య బైక్, బట్టలు కనిపించాయి. గుట్ట పైన చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూసి బోరున విలపించారు. ఘటన స్థలానికి ఎస్ఐ మోహన్ రెడ్డితో పాటు స్థానికులు చేసుకున్నారు. మృతుడి భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు