- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బైక్పై నుండి పడి వ్యక్తి మృతి.. అతి వేగమే కారణం..

X
దిశ, వర్గల్: సిద్దిపేట మంగమ్మ తోట నగర్కి చెందిన పవన్ కుమార్ (19) హొలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి బయలుదేరి సిద్దిపేటకు వస్తున్నాడు. దారి మధ్యలో రాజీవ్ రహదారిపై గౌరారం గ్రామ శివారులో గౌరారం పోలీస్ స్టేషన్ ఎదురుకు రాగానే పవన్ తన బైక్ను అతివేగంగా నడిపాడు. దాంతో బైక్ అదుపుతప్పింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్కు బలంగా గుద్దుకున్నాడు. ఈ ఘటనలో పవన్ కుడి కాలుకు, కడుపులో, మర్మాంగాలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో అతడి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, దర్యాప్తు చేస్తున్నారని గౌరారం ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు.
Next Story