చిన్నారి ప్రాణం తీసిన ఐదు రూపాయల కాయిన్

by Dishafeatures2 |
చిన్నారి ప్రాణం తీసిన ఐదు రూపాయల కాయిన్
X

దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సరదాగా ఆడుకుంటూ కాయిన్​ మింగి చిన్నారి తవును చలించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది. అయితే ఆ కాయిన్ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. చిన్నారి చైత్ర ముద్దుముద్దు మాటలతో అల్లరి చేస్తూ ఆడుకుంటూనే అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.



Next Story