భార్యను ఆ పని చేయలేక కొడుకును సుమోలో తండ్రి..

by Disha Web Desk 4 |
భార్యను ఆ పని చేయలేక కొడుకును సుమోలో తండ్రి..
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య, భర్తలు అన్నాక గొడవలు సహజం. కొంతమంది గొడవలు పడుతూ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన సంఘటనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భార్యపై ఉన్న కోపంతో కొడుకును సైతం కిడ్నాప్ చేసేందుకు వెనుకాడలేదు ఈ రాక్షస తండ్రి. రాయ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిమాలయన్ హైట్స్ కాలనీలో లోకేష్ సింగ్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరికి 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొన్ని రోజులుగా భార్య, భర్తలిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకుల వరకు దారి తీశాయి. ఈ కోపంలోనే భార్య తనకు విడాకులు కావాలని కోర్టును కోరింది. ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉంటుంది. కాగా, కొడుకు బాధ్యతలు తల్లికి అప్పగించింది కోర్టు. ఈ క్రమంలో లోకేష్ భార్యను మానసికంగా వేధిస్తూ కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో తల్లి కొడుకుని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకునేది. పిల్లవాడు బయట ఆడుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన తండ్రి, అతడిని సుమోలో ఎత్తుకెళ్లిపోయాడు. ఆడుకుంటున్న కుమారుడు ఎంతకూ ఇంట్లోకి రాకపోవడంతో బయటకు వచ్చిన తల్లి, చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. సమీపంలో ఉన్న వారిని అడగ్గా.. వాళ్ల తండ్రి వచ్చి తీసుకెళ్లాడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. కొడుకుని ఏం చేస్తాడో అనే భయంతో వెంటనే పోలీస్​లకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed