కొడుకు కోసం చనిపోయిన తండ్రి

by Disha Web Desk 4 |
కొడుకు కోసం చనిపోయిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఓ తండ్రి మాత్రం తన కొడుకు పరీక్షల్లో ఫెయిలయ్యాడని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఈరోడ్ జిల్లా అంబాపేట సమీపంలో చోటుచేసుకుంది.

కల్భావి తొట్టిపాళ్యెంకు చెందిన అప్పుస్వామి (45), సుమతి దంపతులు. వీరికి సంజయ్, చంద్రు ఇద్దరు కుమారులు ఉన్నారు. మైలంపాడి ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న సంజయ్(15) ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తండ్రి కుమారుడిని మందలించి ట్యూషన్‌లో జాయిన్ చేయించాడు. అయితే కుమారుడు చదువును పట్టించుకోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు అప్పుస్వామి. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొదుతూ బుధవారం మరణించాడు. దీనిపై అంబాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్వాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed