- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కూలీ డబ్బులు సరిపోక.. స్మగ్లర్ అవతారమెత్తిన యువకులు

దిశ, కోదాడ: కూలి పనులు చేస్తే వచ్చే కూలి తో వచ్చే డబ్బు సరిపోవడం లేదని అత్యాశకు పోయి ఇద్దరు వ్యక్తులు గంజాయి వ్యాపారం తో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అక్రమంగా రవాణా చేస్తూ కోదాడ పోలీసులకు పట్టుబడ్డ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కోరాపూర్ జిల్లా వాసులు గోపి బారిక్, జయసింగ్ దలాయ్ లు ఇరువురు కూలి పని చేసుకుని జీవనం సాగించేవారు. ఆదాయం సరిపోక గంజాయి అక్రమ రవాణా చేస్తే అధికంగా ఆదాయం వస్తుందని నిర్ణయించుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం లో కోరాపుట్ ఏరియా నందు నిషేధిత గంజాయి తక్కువ రేటుకు అమ్ముతున్నందున, అక్కడ తక్కువ రేటుకు గంజాయిని కొని హైదరాబాద్లో ఎక్కువ రేటుకు అమ్మి లాభ పడదామని భావించారు.
మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఇద్దరూ కలిసి వెయ్యి రూపాయల చొప్పున 20 కిలోల గంజాయి కొని హైదరాబాద్లో ఈ గంజాయిని కిలో ఒక్కింటికి 20 వేల రూపాయల చొప్పున అమ్మి మొత్తం నాలుగు లక్షల రూపాయలకు లాభ పడదామనుకున్నారు. బస్సులో కోరాపుట్ నందు బయలుదేరి వైజాగ్ మీదుగా వస్తుండగా కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీలో పోలీసువారికి పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్దనుండి 20 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ లు నరసింహారావు, నాగ దుర్గా ప్రసాద్, ఎస్సై లు సాయి ప్రశాంత్, క్రాంతికుమార్, రాంబాబు, వెంకట్ రెడ్డి సిబ్బందిని డీఎస్పీ రఘు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించి రివార్డులు అందజేశారు.