- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాజీ మార్గమే రాజమార్గం: జడ్జి సి.హెచ్. ఏఎన్ఎన్ మూర్తి

దిశ, హుజూర్నగర్: రాజీ మార్గమే రాజమార్గం అని మండల న్యాయసేవాధికార సంస్థ హుజూర్నగర్ చైర్మన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి సి.హెచ్.ఏఎన్ఎన్ మూర్తి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కోర్టు హాలులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో 1100 పైగా కేసులు రాజీ అయినట్లు తెలిపారు. 12 సివిల్ కేసులో రాజీ కాగా1100 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. పలు కేసుల్లో జరిమానా విధించగా, మరికొన్ని కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిరినట్టు తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర, లోక్ అదాలత్ సభ్యులు చనగాని యాదగిరి, కమతం నాగార్జున, నారాయణ రెడ్డి, మహేష్ న్యాయవాదులు సుందర్ రాఘవరావు, నట్టే సత్యనారాయణ, అంజయ్య, వెంకటేష్ నాయక్, కొట్టి సురేష్, లతీఫ్, సైదా, శీను నాయక్, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, కోదాడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్సైలు సైదులు, వెంకట్ రెడ్డి, రంజిత్ రెడ్డి రవీందర్, రవి, కొండల్ రెడ్డి కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.