బీజేపీ ఆఫీస్‌లో అనూహ్య పరిణామం.. బలం చూపించుకునే ప్రయత్నం

by Disha Web Desk 2 |
బీజేపీ ఆఫీస్‌లో అనూహ్య పరిణామం.. బలం చూపించుకునే ప్రయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. బీజేపీలో నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. కాషాయ పార్టీలో మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో అభ్యర్థులు ఖరారు కాని సెగ్మెంట్లకు చెందిన నేతలు అలర్ట్ అయ్యారు. టికెట్ తమకే కేటాయించాలనే డిమాండ్‌తో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. సెగ్మెంట్ల వారీగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ప్లకార్డులతో ప్రదర్శనలు చేపడుతున్నారు. స్టేట్ ఆఫీస్‌లో హల్ చల్ చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడాలని చూస్తున్నారు. కాగా, కొందరు నేతలు డైరెక్ట్‌గా రాష్ట్ర నాయకత్వానికే రిక్వెస్టు చేసుకోగా.. కొందరు బల ప్రదర్శనకు దిగుతున్నారు.

మందీ మార్బలం చూపించుకునే యత్నం చేస్తున్నారు. టికెట్ తమకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా గురువారం శేరిలింగంపల్లి టికెట్ యోగా నంద్‌కే ఇవ్వాలని ఆయన మద్దతుదారులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. టికెట్ ఆయనకే ఇవ్వాలంటూ కిషన్ రెడ్డి ఎదుట ప్రదర్శించారు. నేతల అనూహ్య పరిణామంతో వారిని ఎలా సర్దిచెప్పాలో తెలియక రాష్ట్ర నాయకత్వం సతమతమైంది.

Next Story