కోమటిరెడ్డి బ్రదర్స్ జోరు.. మైనంపల్లి ఫ్యామిలీలో ఫాదర్‌కు షాక్

by Disha Web Desk 2 |
కోమటిరెడ్డి బ్రదర్స్ జోరు.. మైనంపల్లి ఫ్యామిలీలో ఫాదర్‌కు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో పలువురు కుటుంబ సభ్యులు పోటీ చేశారు. తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ చేయగా గజ్వేల్‌లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్‌లో ఉన్నారు. మైనంపల్లి, రోహిత్‌లు పోటీ చేయగా మెదక్‌లో మైనంపల్లి రోహిత్ ఆధిక్యంలో కొనసాగుతుండగా మల్కాజ్ గిరిలో హనుమంతరావు వెనుకంజలో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌లో నల్గొండలో వెంకట్ రెడ్డి, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి లీడ్‌లో కొనసాగుతున్నారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో గడ్డం వివేక్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తమ్ దంపతులలో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి లీడ్‌లో ఉన్నారు.

Next Story

Most Viewed