సమాజాన్ని విడదీసి ఎన్నికల్లో గెలవడమే పరమావధి: కేసీఆర్

by Disha Web Desk 19 |
సమాజాన్ని విడదీసి ఎన్నికల్లో గెలవడమే పరమావధి: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అమెరికా, చైనా కంటే ఎక్కువ సంపద ఉందని.. కానీ అమెరికా, చైనా అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయని ప్రశ్నించారు. లక్ష్యాన్ని మరిచి ఈ దేశం దారితప్పిందని అన్నారు. కులమతాల పేరుతో సమాజాన్ని విడదీసి.. ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా మారిందని వ్యాఖ్యానించారు. రైతులు కూడా చట్టసభల్లోకి రావాలని.. అందుకే మా నినాదం అబ్ కీ కిసాన్ సర్కార్ అని పేర్కొన్నారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి.. దేశంలో ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.


Next Story

Most Viewed