ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రం ఏం చేస్తోంది : కూనంనేని

by Sathputhe Rajesh |
ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రం ఏం చేస్తోంది : కూనంనేని
X

దిశ, వెబ్ డెస్క్: గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పార్టీల్లో మాటల మంటలు రేపుతున్నాయి. ఇదే అంశంపై సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా అని గవర్నర్‌ను ప్రశ్నించారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మరోమారు హెచ్చరించారు. ఢిల్లీ ఆదేశాల మేరకు గవర్నర్ పనిచేస్తు్న్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.



Next Story

Most Viewed