- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
గాంధీజీ స్ఫూర్తితో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం

దిశ, హుస్నాబాద్ ; భారతదేశ జాతిపిత గా పేరుగాంచి, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయునిగా గౌరవింపబడుతున్న మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడిచి వారిని స్ఫూర్తిగా తీసుకొని కొనసాగాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో నూతనంగా నెలకొల్పిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి రైతు బజార్ వద్ద ఏర్పాటుచేసిన ఐ లవ్ హుస్నాబాద్ జంక్షన్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 1959లో బొప్పరాజు లక్ష్మీ కాంతారావు విగ్రహాన్ని నెలకొల్పారని మారుతున్న కాలానికి అనుగుణంగా మున్సిపాలిటీ సహకారంతో గాంధీ జంక్షన్ సుందరీకరణ చేయడం జరిగిందన్నారు. హుస్నాబాద్ లో విద్యా ,వైద్యం, వ్యవసాయం, ఉపాధి తోపాటు అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని దీనికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడి నుండి కాగితం పోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నన్ను తమ్ముడు లాగా భావించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. అలాగే చౌటపల్లి ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ కొత్తపల్లి- హుస్నాబాద్ నాలుగు లైన్ల రోడ్డు ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. కొత్తపల్లి నుండి వచ్చే ఫోర్ లైన్ ప్రజల విజ్ఞప్తి మేరకు లోపలికి రానీకుండా ప్రభుత్వ ఆసుపత్రి వరకే వచ్చేలా చేస్తున్నట్లు వెల్లడించారు. గాంధీ చౌరస్తా వరకు వచ్చినట్లయితే సుమారు 200 ఇండ్లు పోతున్నాయని ప్రజల అభీష్టం మేరకు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 2026 జనవరి 26 లోపు హుస్నాబాద్ పట్టణానికి రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు.