- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చావు దెబ్బ రుచి చూపించాం.. ఖబడ్దార్ పాకిస్ధాన్..! కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం భారత్ -పాక్ (India-Pak) మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత సరిహద్దు వెంబడి పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ (Indian Army) ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) సంచలన ట్వీట్ చేశారు. చావు దెబ్బ రుచి చూపించాం.. ఖబడ్దార్ పాకిస్థాన్! అంటూ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి.. మోడీకే చెప్పాం.. అవును మోడీకే చెప్పాం..!, పహల్గామ్ (Pahalgam)లో మీరు చేసిన నెత్తుటి వికృతక్రీడ గురించి మోడీకే చెప్పాం.. అని రాసుకొచ్చారు. అలాగే అతివల నుదుట సింధూరాన్ని చెరిపి మీరు పొందిన ఉన్మాదానందాన్ని మోడీ (Modi)కే చెప్పాం.. మతం అడిగి మీరు సృష్టించిన నెత్తుటి కలిని మా మోడీకే చెప్పాం.. అని వ్యాఖ్యానించారు. అంతేగాక భారత మహిళా శక్తిని ఎగతాళి చేసిన మీ పాలిట రక్త సింధూరం లిఖిస్తున్నాం.. నింగి, నేల, నీరు ఏ ప్రదేశంలోనైనా మీకు చావు దెబ్బ రుచి చూపించాం అని హాట్ కామెంట్స్ చేశారు. ఇక పహల్గామ్లో మీరు చేసిన గాయం ఇప్పుడు గర్జనగా మారింది అంటూ.. ఖబడ్దార్ పాకిస్తాన్! అని కేంద్రమంత్రి వార్నింగ్ ఇచ్చారు.