ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాం మాకు దారి చూపండి.. మానుకోటలో ఉద్రిక్తత

by Aamani |
ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాం మాకు దారి చూపండి.. మానుకోటలో ఉద్రిక్తత
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగళవారం కలెక్టరేట్ దగ్గర లో ఉన్న ప్రభుత్వ భూములు నిరుపేదలైన ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా నివాసనం ఉంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులు వచ్చి గుడిసెలు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రజలు పెట్రోల్ బాటిళ్ల తో నిరసన తెలిపారు. పోలీస్ జులుం నశించాలి అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్లవారి నుంచి మూడు గంటల వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పె ధర్నాలు, రాస్తారోకో చేశారు. మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రభుత్వ భూములు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు, పోలీసులు చెప్పినప్పటికీ నిరుపేదలైన ప్రజలు ప్రతి ఘటించి అక్కడే భీష్మించి కూర్చున్నారు. గుడిసెలను తొలగించే ప్రయత్నం పోలీసులు చేశారు. అటు సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story