బ్రేకింగ్ న్యూస్... అప్పు ఇచ్చినందుకు రైల్వే ఉద్యోగి హత్య

by Dishanational1 |
బ్రేకింగ్ న్యూస్... అప్పు ఇచ్చినందుకు రైల్వే ఉద్యోగి హత్య
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. కడిపికొండ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జిర్ర ప్రదీప్ అదే గ్రామానికి చెందిన తన బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్ కుమార్ కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. గడువు ముగియడంతో తిరిగి డ‌బ్బులు ఇవ్వాల‌ని బుధ‌వారం ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈక్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే బుధ‌వారం రాత్రి పెసరి వినయ్ మ‌రి కొంత‌మంది స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌దీప్‌పై గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో దాడి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఒంటిపైనా క‌త్తిపోట్లు, గొడ్డ‌లి గాట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. క‌డిపికొండ గ్రామానికి స‌మీపంలోని చెట్ల పొద‌ల్లో ప్ర‌దీప్ ప‌డి ఉండ‌టాన్ని గుర్తించిన స్థానికుల ఆయ‌న స్నేహితులు, కుటుంబ స‌భ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు అక్క‌డికి చేరుక‌ుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలోనే త‌న‌పై దాడి చేసింది విన‌య్‌, గోపిలంటూ ప్రదీప్ వెల్ల‌డించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్ర‌దీప్ మృతి చెందాడు. అయితే ప్ర‌దీప్‌పై ప‌క్కా ప్లానింగ్‌తోనే దాడి జ‌రిగిన‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. కేవ‌లం డ‌బ్బుల విష‌య‌మేనా..? మ‌రేదానా కార‌ణమై ఉంటుందా..? అన్న కోణంలో కుటుంబ స‌భ్యులు, బంధువులు ఆరా తీస్తున్నారు. ప్ర‌స్తుతం విన‌య్‌తో పాటు ఈ దాడిలో పాల్గొన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వ్యక్తులు ప‌రారీలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కాజీపేట పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed